Air India | టాటా సన్స్ ఆధీనంలోని విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తన ప్రయాణికుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. తన నెట్ వర్క్ పరిధిలో శుక్రవారం.. ‘నమస్తే వరల్డ్ సేల్’ అనే ఆఫర్ ప్రతిపాదించింది. ఈ ఆఫర్ సోమవారం (ఫిబ్రవరి 5) వరకూ కొనసాగుతుంది. ఎకానమీ క్లాస్’లో దేశీయ రూట్లలో రూ.1799, విదేశాల్లోని కేంద్రాలకు రూ.3,899 టికెట్తో ప్రయాణించవచ్చు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర దేశీయ మార్గాల్లో రూ.10,899 నుంచి ప్రయాణించవచ్చు.
తక్కువ ధరకే విలాసవంతమైన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ స్పెషల్ ప్రమోషన్.. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఫస్ట్ కం, ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ ప్రకారం పరిమిత ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న వారికి కన్వీనెన్స్ ఫీజు బుక్ ఫీజు మాఫీ చేస్తుంది. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
భారత్-అమెరికా: వన్ వే రూ.31,956, రిటర్న్స్ రూ.54,376
ఇండియా టూ యూరప్ – రూ.22,283 (వన్ వే), రూ.39,244 (రిటర్న్స్)
ఇండియా టు గల్ఫ్ అండ్ మద్య ప్రాచ్యం – రూ.7,714 (వన్ వే) – రూ.13,547 (రిటర్న్)
ఇండియా టు సింగపూర్ – రూ.6,772 (వన్ వే), రూ.13,552 (రిటర్న్)
ఇండియా టు మెల్ బోర్న్ – రూ.29,441 (వన్ వే), రూ.54,207 (రిటర్న్)
ఇండియా టు ఖాట్మండు – రూ.3,899 (వన్ వే), రూ.9600 (రిటర్న్)