న్యూఢిల్లీ, ఆగస్టు 4: కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) చీఫ్తో ఎయిర్ ఇండియా సీఈవో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్స్ విలీనంపై ఇరువురు ప్రధానంగా చర్చించారు.
దేశీయ విమానయాన రంగంలో 75 శాతం వాటాతో ఇండిగో దూసుకుపోతుండగా..దీనికి పోటీగా ఎయిర్ ఇండియా తన సేవలను వేగవంతంగా విస్తరిస్తున్నది. మరోవైపు, స్పైస్జెట్, గో ఫస్ట్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాయి. అన్ని అనుమతులు జారీ అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ విలీనం పూర్తికానున్నది. టాటా, సింగపూర్ ఎయిర్లైన్స్లు సంయుక్తంగా విస్తారాను నెలకొల్పిన విషయం తెలిసిందే.