న్యూఢిల్లీ, జూన్ 26 : కృత్రిమ మేధస్సు (ఏఐ) సేవల నుంచి భారతీయ ఐటీ సేవల రంగం ఇప్పటికే రూ.1.13 లక్షల కోట్ల వ్యాపారం సృష్టించిందని ఇండస్ట్రీ సంఘం నాస్కామ్ అంచనా వేసింది. దాదాపు 25 శాతం కంపెనీలు.. తమ ఉత్పత్తిలో ఏఐతో ప్రయోగాలు చేస్తున్నాయని వివరించింది.
ఈ క్రమంలోనే సంప్రదాయ ఐటీ సర్వీసుల ప్రాముఖ్యతను ఏఐ తగ్గిస్తుందన్న ఆందోళనలను నాస్కామ్ కొట్టివేసింది. న్యూయార్క్ నగరంలో జరిగిన నాస్కామ్ అమెరికా సీఈవో ఫోరంలో ఐటీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రస్తుత ఏఐ శకంలోనూ సంప్రదాయ ఐటీ రంగం కీలకమేనన్నారు.