Ultratech | న్యూఢిల్లీ, జూలై 21: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన సిమెంట్ సంస్థ అల్ట్రాటెక్ రాణించింది. జూన్30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,688 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ను ఆర్జించింది. ఏడాది క్రితం నమోదైన రూ.1,584 కోట్లతో పోలిస్తే 7 శాతం అధికమని పేర్కొంది.
గత త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు రూ.15 వేల కోట్ల నుంచి రూ.17,519 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 83 శాతం నుంచి 89 శాతానికి పెంచుకున్నట్లు తెలిపింది. అలాగే దేశీయంగా విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 20 శాతం పెరిగాయి. దీంతో ప్రస్తుతం సంస్థ ఏడాదికి 131.25 మెట్రిక్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్నది.