న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: హిండన్బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో ప్రారంభమైన అదానీ గ్రూప్ షేర్ల పతనం గురువారం సైతం కొనసాగింది. ఈ గ్రూప్లో అన్ని షేర్లలో చాలావరకూ నష్టాల్లో ముగిశాయి. తాజాగా ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)ను రద్దు చేసుకున్న అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు భారీగా 26.50 శాతం క్షీణించి రూ. 1,565 వద్ద ముగిసింది. ఇది ఏడాది కనిష్ఠస్థాయి. ఈ షేరు ధర మంగళవారం ముగిం పు రూ.2,965 స్థాయి నుంచి రెండు రోజుల్లోనే దాదాపు సగమై పో యింది.
పలు గ్రూప్ షేర్లు వరుసగా ఆరో రోజు సైతం నష్టాల్ని చవిచూశాయి. 10 లిస్టెడ్ అదానీ కంపెనీలు ఈ ఆరు రోజుల్లో రూ.8.76 లక్షల కోట్ల విలువను కోల్పోయాయి. గురువారం అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 10 శాతం పతన మై లోయర్ సర్క్యూట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. ఇదేరీతిలో అదానీ వి ల్మార్, అదానీ పవర్, ఎన్డీటీవీ షేర్లు స్టాక్ ఎక్సేంజీలు నిర్దేశించిన 5% లోయర్ సర్క్యూట్ వద్ద నిలిచాయి. అదానీ పోర్ట్స్ 6.13 శా తం పడిపోయింది. కొద్ది నెలల క్రితం గ్రూప్ టేకోవర్ చేసిన అంబూజా సిమెంట్స్ 5% లాభపడగా, ఏసీసీ స్వల్పంగా పెరిగింది.