న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన షేర్ల పతనం కొనసాగుతున్నది. ఇప్పటికేలో భారీగా పడిపోయిన గ్రూపునకు సంబంధించిన షేర్లు శుక్రవారం కూడా ఐదు శాతం వరకు నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో లిైస్టెన అదానీ గ్రూపు 10 కంపెనీల షేర్లలో ఏడు షేర్లు నష్టపోయాయి.
ఎన్డీటీవీ షేరు 4.87 శాతం నష్టపోగా.. అదానీ పవర్ 4.27 శాతం, అదానీ విల్మార్ 3.24 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.90 శాతం, అదానీ పోర్ట్స్ 2.56 శాతం, ఏసీసీ 2.08 శాతం, అంబుజా సిమెంట్స్ స్వల్పంగా నష్టపోయింది. ఎన్డీటీవీ లోయర్ సర్క్యూట్ను తాకింది.