న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అదానీ గ్రూప్ తనఖా చేసిన షేర్లలో కొంత వాటాను బ్యాంక్ల నుంచి విడిపిస్తున్నది. తనఖా షేర్ల విడుదలకు కాలపరిమితికి ముందుగానే 1,114 మిలియన్ డాలర్లు (రూ.9,222 కోట్లు) చెల్లిస్తున్నట్టు అదానీ గ్రూప్ సోమవారం తెలిపింది. 168.27 మిలియన్ల అదానీ పోర్ట్స్ షేర్లు (ప్రమోటర్ల వాటాలో 12 శాతం), 27.56 మిలియన్ల అదానీ గ్రీన్ షేర్లు (3 శాతం), 11.77 మిలియన్ల అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు (1.4 శాతం) విడిపించేందుకు రూ.9,222 కోట్లు చెల్లిస్తున్నట్టు గ్రూప్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ షేర్ల మీద తీసుకున్న రుణాల చెల్లింపు కాలపరిమితి 2024 సెప్టెంబర్కాగా, ముందుగానే చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఐదు అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ. 40,000 కోట్లకుపైగా విలువైన షేర్లు తనఖాలో ఉన్నాయి.