హైదరాబాద్, ఏప్రిల్ 6: హైదరాబాద్ కేంద్రస్థానంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం సంస్థ క్విక్ఆన్ తన సేవలను ఆరంభించింది. దేశంలో మొట్టమొదటి మొబైల్ ఆధారిత డిజిటల్ చెల్లింపు ఫ్లాట్ఫాం ఇంటర్నెట్(స్మార్ట్ఫోన్లో మొబైల్ డాటా) లేకుండా లావాదేవీలను జరుపుకోవచ్చును. ఈ అధునాతన సాంకేతికతతో కూడిన మొబైల్ వ్యాలెట్ను కంపెనీ ప్రచారకర్త మహేశ్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు హాజరయ్యారు.