న్యూఢిల్లీ, జూలై 27: అదానీ గ్రూపునకు చెందిన సిమెంట్ తయా రీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ రాణించింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ. 466.14 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. అమ్మకాలు పెరగడం, చ మురు ధరలు తగ్గుముఖం పట్టడం, పనితీరు మెరుగుపడటం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ఆదాయం రూ.4,460.42 కోట్ల నుంచి రూ.5,201.11 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.