న్యూఢిల్లీ, మే 6: అమెజాన్ పే (ఇండియా), హీరో ఫిన్కార్ప్లతో సహా 22 ఫైనాన్స్ కంపెనీలకు అధార్తో క్లయింట్ల వెరిఫికేషన్ను కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది. ఇప్పటికే యాంటీ మనీలాండరింగ్ చట్టం పీఎంఎల్ఏ పరిధిలో ఉన్న 22 ఫైనాన్స్ సంస్థలు ఇక నుంచి క్లయింట్ల గుర్తింపునకు ఆధార్ నంబర్లను ఉపయోగించి వెరిఫై చేయవచ్చని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.
ప్రస్తుతం బ్యాంక్లు ఖాతాదారుల కేవైసీ కోసం ఈ పద్ధతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ తాజాగా అనుమతించిన ఫైనాన్స్ కంపెనీల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే ఇండియా, ఆదిత్యాబిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ తదితరాలు ఉన్నాయి.