న్యూఢిల్లీ, జనవరి 1: రికార్డు స్థాయిలో ఆదాయ పన్ను దాఖలు చేశారు. డిసెంబర్ 31తో ముగిసేనాటికి 2023-24 అసెస్మెంట్ ఏడాదికిగాను 8.18 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది దాఖలు చేసిన 7.51 కోట్ల కంటే 9 శాతం చొప్పున పెరిగారని పేర్కొంది.