హైదరాబాద్, అక్టోబర్ 7: విద్యుత్ వాహన తయారీ సంస్థ ఫ్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 201 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1,14,999.
రివర్స్ మోడ్ కలిగిన ఈ స్కూటర్ నాలుగు రంగుల్లో లభించనున్నదని తెలిపింది. రోజుకు వంద కిలోమీటర్లు ప్రయాణించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు ఫ్యూర్ ఈవీ సీఈవో రోహిత్ తెలిపారు.