కోట్ల జీతం కాదని.. వేల కోట్ల సంస్థకు ఓనరైన ఫిజిక్స్వాలా సీఈవో అలఖ్ పాండే
న్యూఢిల్లీ, జూన్ 8: ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. నచ్చినదాన్ని, నమ్మినదానికి కట్టుబడి ఉంటే విజయం దాసోహమంటుంది. దీనికి చక్కని ఉదాహరణ.. ఫిజిక్స్వాలా సీఈవో అలఖ్ పాండే. లక్షల్లో జీతం వస్తే చాలు.. అన్నింటినీ పక్కన పెట్టేస్తారు అంతా. అయినా కోట్లిస్తామన్నా కాదని.. తన ఆశయానికి ఊపిరిలూదారు. అందుకే నేడు వేల కోట్ల సంస్థకు సారథిగా నిలిచారు. ఇప్పుడు దేశంలో 101వ యూనికార్న్ ఫిజిక్స్వాలా. సిరీస్ ఏ ఫండింగ్తో ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఎడ్టెక్ కంపెనీ కూడా ఇదే. ఇంజినీరింగ్ విద్యను సగంలో ఆపేసి విజేతగా నిలిచిన అలఖ్ పాండే.. ఆద్యంతం ఆసక్తిదాయకంగా నిలుస్తున్నారు.
22 ఏండ్ల వయసులో ఇంజినీరింగ్ చదువును కాదని సొంతూరు అలహాబాద్కు వచ్చి ఫిజిక్స్ పాఠాలు చెప్తూ రూ.5వేల సంపాదనతోనే సరిపెట్టుకున్నారు. దీని వెనుక.. దేశంలోని సగటు తల్లిదండ్రుల అతి సాధారణమైన కోరిక తమ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న లక్ష్యమే దాగి ఉన్నది. అన్అకాడమీ (నిజానికి పాండే పేరు చెప్పలేదు) అనే సంస్థ రూ.75 కోట్ల జీతమిస్తామని పాండేకు ఆఫర్ ఇచ్చింది. అయినా కాదని ప్రతీ పిల్లవాడికి నాణ్యమైన ఉన్నత విద్య చౌకగా అందాలని ఫిజిక్స్వాలా స్టార్టప్ తెచ్చానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పాండే చెప్పారు. కాగా, విద్యార్థుల నుంచి విశేష స్పందన రావడంతో ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్.. యూట్యూబ్లో మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే వెస్ట్బ్రిడ్జ్, జీఎస్వీ వెంచర్లు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.777 కోట్లు) పెట్టుబడులు పెట్టాయి.
ఇప్పుడు ఫిజిక్స్వాలా విలువ 1.1 బిలియన్ డాలర్లు (రూ.7,500 కోట్లపైనే). ఈ యూట్యూబ్ చానల్లో రూ.1,900 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 500 మంది టీచర్లు, 90-100 టెక్ నిపుణులున్నారు. విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు 200 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుండగా, జేఈఈ, నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల కోసం 200 మంది నిపుణులూ పనిచేస్తుండటం విశేషం. ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న అన్అకాడమీని.. పైసా వెచ్చించని ఫిజిక్స్వాలా ఆదాయం దాటేసిపోవడం కొసమెరుపు.
75 crore and reached Rs. 7,500 crore