Financial Changes | నూతన ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతున్నది. ఈ తరుణంలో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ పెట్టుబడులపై ఓ లుక్ వేయడం మరిచిపోవద్దు. రుణాలు తీసుకోవాలనుకుంటున్నారా.. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) నిర్ణయంపై దృష్టి పెట్టడం మర్చిపోవద్దు సుమా.. అంతే కాదు..ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయం పన్ను నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి నగదు విత్ డ్రాయల్స్, పోస్టాఫీసుల్లో ఇన్వెస్ట్మెంట్లలోనూ మార్పులు జరుగుతాయి. ఏప్రిల్ నెలలో మీ పర్సులో మనీ ఖర్చయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఓ లుకేద్దామా..!
Mutualfunds
నో
ఎల్టీసీజీ టాక్స్ మినహాయింపుఎన్పీఎస్ టైర్-1 ఖాతాలో ఐదేండ్ల డిపాజిట్ తరవాత.. అందులో 25 శాతం విత్డ్రా చేసుకోవచ్చు.
అనారోగ్య చికిత్స, వైకల్య సమస్యలకు, పిల్లల వివాహం లేదా ఉన్నత విద్యాభ్యాసం, ఆస్తుల కొనుగోళ్లు. మొత్తం ఎన్పీఎస్ టైర్-1 ఖాతా పెట్టుబడి కాలంలో గరిష్టంగా మూడు సార్లు నగదు విత్డ్రాకు అనుమతి.
ఏప్రిల్ ఆరో తేదీన ఆర్బీఐ తొలి ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) ప్రకటన.
ఆందోళనకర స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతున్నందున రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు పెంచవచ్చునని నిపుణుల అంచనా.
2022-23లో 250 బేసిక్ పాయింట్ల పెంపుతో 6.50 శాతానికి చేరుకున్న ఆర్బీఐ రెపోరేట్.
రెపోరేట్ మళ్లీ పెంచితే, ఇండ్ల రుణాలు, ఇతర రుణాలపై వడ్డీరేట్లు పెరుగుదల.