Rayadurgam Trade Center | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్సిటీలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ప్రతిపాదిత 5స్టార్ లగ్జరీ హోటల్ కమ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం వాయిదా పడింది. తాము పిలిచిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు, ఎప్పుడు చేపట్టేదీ తరువాత వెల్లడిస్తామని టీఎస్ఐఐసీ ప్రకటించింది.
మైండ్స్పేస్ జంక్షన్ వద్ద మూడెకరాల వైశాల్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణానికి గత ఏడాది అక్టోబర్లో టీఎస్ఐఐసీ ఆర్ఎఫ్పీలు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీని అంచనా వ్యయం రూ.500కోట్లుగా నిర్ణయించారు.