న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ నికర లాభంలో 40 శాతం వృద్ధి నమోదైంది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.2,683.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.1,907.67 కోట్లుగా ఉన్నది. కంపెనీ ఆదాయం రూ.15,549 కోట్ల నుంచి రూ.26,968.21 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10,363.97 కోట్ల ఆదాయంపై రూ.1,725.93 కోట్ల నికర లాభాన్ని గడించింది.