హైదరాబాద్, జూలై 21: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..తాజాగా ప్రీమియం లైఫ్ైస్టెల్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. తన తొలి మాడ్రన్-రెట్రో మోటర్సైకిల్ ‘రోనిన్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. 225 సీసీ కెపాసిటీ కలిగిన ఈ బైకు మూడు రకాల్లో లభించనున్నది.
వీటిలో రోనిన్ ఎస్ఎస్ మోడల్ రూ.1.49 లక్షలుకాగా, డీఎస్ మోడల్ రూ.1,56,500, టాప్ వేరియంట్ టీడీ రకం రూ.1,68,750గా నిర్ణయించింది. ఈ ధరలు హైదరాబాద్ షోరూంనకు సంబంధించినవి. నూతన రైడింగ్ అనుభవం కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఈ బైకును రూపొందించినట్లు. ముఖ్యంగా ైస్టెల్, టెక్నాలజీ పరంగా వాయిస్ అసిస్టెన్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ ఉండటంతో యువతకు నచ్చుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.