ఢిల్లీ : భారత్లో ఫోర్త్ జెనరేషన్ టక్సన్ను హ్యుందాయ్ లాంఛ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లలో 2020లో ఎంట్రీ ఇచ్చిన టక్సన్ ప్రస్తుతం భారత్లో అందుబాటులోకి వచ్చింది. ప్లాటినం, సిగ్నేచర్ ఆప్షన్లలో రూ 27.68 లక్షల ప్రారంభ ధరతో టక్సన్ లభిస్తుంది. 2022 హ్యుందాయ్ టక్సన్ జీప్ కంపాస్, స్కోడా కొడియక్, వోక్స్వ్యాగన్ టైగున్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.
టక్సన్ అప్పియరెన్స్లో మార్పులను జోడిస్తూ కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేటెడ్ వెర్షన్ను డిజైన్ చేశారు. ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో ఫ్రంట్ గ్రిల్స్ ఆకట్టుకోగా, కిందిభాగంలో ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ అమర్చారు. స్ట్రైకింగ్ డిజైన్తో టెయిల్ల్యాంప్స్ వెహికల్కు మెరుగైన లుక్ను తీసుకువచ్చాయి.
ఇక క్యాబిన్లో ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్తో 10.25 ఇంచ్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఆకట్టుకుంటుంది. పనారోమిక్ సన్రూఫ్, బోస్ ఆడియో, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ప్యాసింజర్ వాకిన్ పంక్షన్, రిక్లైనింగ్ రియర్ సీట్లు వంటి ఫీచర్లున్నాయి. ఫ్రంట్ కొల్లవిజన్ వార్నింగ్, కొలిజన్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, ఆరు ఎయిర్ బ్యాగ్లు వంటి పలు సేఫ్టీ ఫీచర్లున్నాయి.