న్యూఢిల్లీ : భారత్లో 2022 సీబీ300ఆర్ బైక్ను హోండా లాంఛ్ చేసింది. త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానుండగా బైక్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా హోండా డీలర్షిప్ల వద్ద బుధవారం నుంచి షురూ అయ్యాయి. మ్యాటీ స్టీల్ బ్లాక్, పెరల్ స్పార్టన్ రెడ్ కలర్లలో అందుబాటులో ఉండే హోండా సీబీ300ఆర్ రూ 2.77 లక్షల ఎక్స్-షోరూం ధరకు లభిస్తుంది.
హై స్టాండర్డ్స్ ఇంజనీరింగ్తో పాటు అత్యాధునిక ఫీచర్లు డైనమిక్ రోడ్ ప్రెజెన్స్తో ఈ బైక్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈఓ అతుషి ఒగటా తెలిపారు.
న్యూ 2022 అవతార్లో స్పోర్టీ అప్పీల్లో న్యూ సీబీ300ఆర్ ముందుకొచ్చిందని కంపెనీ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా వెల్లడించారు. డిసెంబర్ 21 ఇండియా బైక్ వీక్లో న్యూ బైక్కు అద్భుత స్పందన వచ్చిందని ఈరోజు నుంచి బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని చెప్పారు.