World Richest Companies : ప్రపంచంలోని విలువైన కంపెనీల్లో అమెరికాకు చెందిన యాపిల్ మొదటి స్థానం దక్కించుకుంది. లండన్కు చెందిన హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 2022 సంవత్సరంలో సంపన్నమైన 500 కంపెనీల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్లో 20 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. యాపిల్ కంపెనీ 2.4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో మొదటి ప్లేస్లో ఉంది. 1.8 లక్ష కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. 1.3 లక్షల కోట్ల డాలర్ల సంపదతో ఆల్ఫాబెట్ కంపెనీ మూడో స్థానం సొంతం చేసుకుంది. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (1.2 లక్షల కోట్ల డాలర్లు), ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా (672 బిలియన్ డాలర్లు)కంపెనీలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. బెర్క్షైర్ హథవే 624 బిలియన్ డాలర్ల సంపదతో ఆరోస్థానంలో ఉంది.
భారత దేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 220 బిలియన్ డాలర్ల సంపాదనతో 34వ స్థానం దక్కించుకుంది. 139 బిలియన్ డాలర్ల విలువతో అదానీ గ్రూప్ భారత్ నుంచి రెండో కంపెనీగా నిలిచింది. ఈ 500 కంపెనీల సంపద 11.1 లక్షల కోట్ల డాలర్లు కావడం విశేషం. గత రెండేళ్లతో పోల్చితే 7 బిలియన్ డాలర్లు ఎక్కువ అని హురున్ ఇండియా ఛైర్మన్ రూపర్ట్ హుగెవెర్ఫ్ తెలియజేశాడు.