న్యూఢిల్లీ, జనవరి 23: బంగారం, వెండి ఫైండింగ్స్, నాణేలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, పిన్స్,క్లాంప్ తదితరాల్ని ఫైండింగ్స్గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకూ బంగారం, వెండి బార్స్పై దిగుమతి సుంకం 15 శాతం ఉండగా, ఫైండింగ్స్, నాణేలపై 11 శాతమే కొనసాగుతున్నది. ఇక నుంచి బార్స్కు సమానంగా వీటికి కూడా సుంకం వర్తించేలా 11 శాతం నుంచి 15 శాతానికి పెంచినట్టు (సెస్తో కలిపి) ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రెండు నెలలుగా ఫైండింగ్స్, నాణేల దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని బార్స్గా మార్పిడి చేయడాన్ని నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెంపుదల జనవరి 22 నుంచి అమలులోకి వచ్చింది. అలాగే విలువైన లోహాల పొడి దిగుమతులపై 4.35 శాతం సెస్ విధిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రస్తుతం ఉన్న 10 శాతం బేసిక్ దిగుమతి సుంకానికి అదనంగా సెస్ను విధించారు.