హైదరాబాద్(శంషాబాద్), మార్చి 16: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 ఏడాదికిగాను స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్’ అవార్డు వరించింది. భారత్తోపాటు దక్షిణాసియాలోనే బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్గా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచినట్లు స్కైట్రాక్స్ పేర్కొంది.
బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్ అవార్డుతోపాటు బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ..విమాన ప్రయాణికులకు అసాధారణమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతకు ఈ అవార్డు గుర్తింపునిచ్చిందన్నారు. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సిబ్బందికి ఈ సందర్భంగా ధన్యవాదములు తెలిపారు.