హైదరాబాద్, ఫిబ్రవరి 4: దేశంలో అతిపెద్ద డయగ్నస్టిక్ సేవల సంస్థల్లో ఒకటైన విజయా డయాగ్నస్టిక్ సెంటర్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.113.79 కోట్ల ఆదాయంపై రూ.25.43 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ఆదాయంతో పోలిస్తే 11 శాతం వృద్ధిని కనబరుచగా, నికర లాభంలో 2 శాతం అధికమైంది. మరోవైపు, ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలానికిగాను రూ.355 కోట్ల ఆదాయంపై రూ. 86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత త్రైమాసికంలో కొత్తగా నాలుగు సెంటర్లను ప్రారంభించినట్లు కంపెనీ సీఈవో సుప్రితా రెడ్డి తెలిపారు.