హైదరాబాద్, నవంబర్ 11: మిల్లెట్ స్నాక్స్ తయారీ సంస్థ ట్రూ గుడ్…సిరీస్ ఫండింగ్లో భాగంగా ఓఏకేఎస్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి రూ.55 కోట్లు నిధులను సేకరించింది. ఇలా సేకరించిన నిధులను తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాలకు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి వినియోగించనున్నట్లు కంపెనీ సీఈవో, ఫౌండర్ రాజు భూపతి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్తోపాటు రాజమండ్రిలో మిల్లెట్ చిక్కీస్ తయారీ యూనిట్లను నెలకొల్పినట్లు, వచ్చే ఏడాదిలోగా తెలంగాణలో మరో రెండు, ఇతర రాష్ట్రల్లో మూడు యూనిట్లను నెలకొల్పే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 55 కోట్లుగా ఉన్న టర్నోవర్ వచ్చే రెండు నుంచి మూడేండ్లలో రూ.250-300 కోట్ల టర్నోవర్ చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. అలాగే సంస్థలో 250 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, రెండేండ్లలో ఈసంఖ్య 1000కి పెంచుకోనున్నది. ఇప్పటి వరకు వ్యాపారాన్ని విస్తరించడానికి రూ.9 కోట్ల మేర పెట్టుబడిగా పెట్టింది సంస్థ..వచ్చే రెండేండ్లలో రూ.60 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.