హైదరాబాద్: ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్బజార్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 12 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద నిత్యావసర వస్తువులపై భారీ తగ్గింపునకు విక్రయిస్తున్నది. కంపెనీకి చెందిన రిటైల్ అవుట్లెట్లతోపాటు ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి కూడా ఈ ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ‘సబ్సే బడి సేవింగ్స్’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు నిత్యావసర వస్తువులతోపాటు ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులకు కూడా వర్తించనున్నాయి.