హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అటల్ ఇన్నోవేషన్ సెంటర్(ఏఐసీ)..టీ హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని రోడా మిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రిసెర్చ్ సెంటర్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా ‘సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్’ అనే అంశంపై నిపుణులు ప్రసంగించారు. కొత్త ఆలోచనను ఆవిష్కరణగా మార్చాలన్న లక్ష్యం ఉన్నవారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్టు ఈ సందర్భంగా టీ హబ్ ప్రతినిధులు వెల్లడించారు.