Monsoon | వానకాలంలో చిరుజల్లులు వేసవితాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కానీ, వాతావరణంలో తేమ పెరగడంతో ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొడిబారుతుంది. మొహానికి మొటిమలు పుట్టుకొస్తాయి. చర్మం దురదగా ఉంటుంది. వీటన్నిటి నుంచి ముఖారవిందాన్ని కాపాడు కోవడానికి సంప్రదాయ చిట్కాలు…
ఒక టేబుల్ స్పూన్ తేనెను రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమానంగా ముఖానికి రాసుకోవాలి. రెండుమూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. ఇది చర్మాన్ని కాంతిమంతం చేసి, ముఖం మీదున్న జిడ్డును వదలగొడుతుంది.
ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు (జెల్) లేదా జ్యూస్ను పావుభాగం తురిమిన కీర దోసతో కలుపుకోవాలి. దీనిని ముఖం, మెడకు ప్యాక్లా వేసుకోవాలి. 15 నిమిషాలు అలానే ఉంచాలి. తర్వాత వెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. కలబందలోని ప్రాకృతిక గుణాలు, దోసలోని చల్లదనం రెండూ కలిసి చర్మానికి కొత్త శక్తినిస్తాయి. హైడ్రేట్ చేస్తాయి.
సగం కప్పు ఓట్స్ పిండి, ఒక కప్పు సున్నిపిండి (లెంటిల్స్ పౌడర్), పావుకప్పు బియ్యపు పిండి, 9 బాదం పప్పులు (నూరుకోవాలి), చిటికెడు పసుపు మిశ్రమాన్ని రోజ్వాటర్తో కలుపుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం మీద పేరుకుపోయిన మలినాలను, ఎక్కువైన నూనెను తొలగిస్తుంది.