బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె పక్కా ఆంత్రప్రెన్యూర్ రూపమెత్తింది. సౌందర్య సాధనాల రంగంలో సొంతంగా ఒక బ్రాండ్ను తీసుకువచ్చింది. వ్యాపారవేత్త జిగర్ కె షా భాగస్వామిగా ‘820 E’ పేరుతో దీన్ని ప్రారంభించింది. భారత ప్రామాణిక కాలాన్ని ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కకడతారని మనకు తెలిసిందే. ఆ పేరు మీదనే తన బ్రాండ్కు నామకరణం చేసినట్టు వెల్లడించింది దీపిక. బార్న్ ఇన్ ఇండియా, ఫర్ ద వరల్డ్ (భారత్లో పుట్టింది… ప్రపంచం కోసం) అనే ట్యాగ్లైన్నూ జోడించింది.
వివిధ ఆయుర్వేద మూలికల్ని ఉపయోగించి ఈ చర్మ సౌందర్య ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నట్టు వెల్లడించింది దీపిక. చర్మ సంరక్షణను ఒక సంప్రదాయంగా మార్చాలన్నదే తన బ్రాండ్ ఉద్దేశమని ప్రకటించింది దీపిక. తమ ఉత్పత్తులన్నీ చర్మాన్ని ఆరోగ్యవంతం చేసేందుకు తయారు చేసినవేననీ, వీటి పనితీరుకు సంబంధించి ప్రామాణిక పరీక్షలన్నీ నిర్వహించాకే మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు చెప్పింది. సినీ నటిగానే కాదు, నిర్మాతగా, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా పేరుతెచ్చుకున్న దీపిక ఈ కొత్త అడుగుతో ఆంత్రప్రెన్యూర్గా మారిపోయింది!