విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జూలాజికల్ పార్కులను బంద్ చేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జూ పార్కులతో పాటు, ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్కులను కూడా మూసివేస్తున్నట్లు తెలిపింది. జంతువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించింది.