YSR Congress Party | వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలోని మరో రెండు స్థానాలకు ఇన్ చార్జీలను ప్రకటించింది. కందుకూరు నియోజకవర్గ ఇన్ చార్జీగా శ్రీమతి కఠారీ అరవింద యాదవ్, పర్చూరు ఇన్ చార్జీగా ఎడం బాలాజీలను నియమించింది. వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జీలను నియమిస్తున్నారు.