అమరావతి : విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గంజాయి తరలిస్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. అతని వెంట ఉన్న మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పశ్చిమగోదావరికి చెందిన గోపి కృష్ణ (23), విశాఖపట్నానికి చెందిన వరుణ్ ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంలో గంజాయి తీసుకుని అరకు నుంచి విశాఖపట్నం వస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కిందపడిన గోపి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. వరుణ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.