అమరావతి : ఏపీలోని గుంటూరు కృష్ణానగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడో యువకుడు. కృష్ణానగర్ పీఎఫ్ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్లో ఈ ఘటన జరిగింది. ధర్మ అనే యువకుడు తల్లీ కూతురుపై గొంతుపై బ్లేడ్తో దాడి చేసి గాయపరిచాడు.
ఇద్దరికి స్వల్ప గాయాలవగా.. వారిని స్థానికులు దవాఖానాకు తరలించారు. ఆ తర్వాత యువకుడి అపార్ట్మెంట్ రెండో అంతస్తు నుంచి దూకేందుకు యత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ధర్మకు స్వల్ప గాయాలవగా.. జీజీహెచ్కు తరలించారు.