అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైసీపీకి చెందిన జడ్సీటీసీ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరుకు చెందిన జడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన రాజీనామా పత్రాన్ని ఇవాళ కలెక్టర్ రంజిత్ బాషాకు అందజేశారు. వైసీపీకి చెందిన పార్టీ పెద్దలు సరైనా ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం లేదని పేర్కొంటూ ఆమె రాజీనామా చేశారు.