అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు మంగళగిరిలో జరుపనున్నారు. జులై 8,9వ తేదీన పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబును ఓడించండి ప్రజలకు సేవ చేసేందుకు వైసీపీకి మరోసారి అవకాశమివ్వండి అనే నినాదంతో ప్లీనరి సమావేశం నిర్వహించుకోనున్నామని తెలిపారు.
2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175కు స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల క్రితం మంగళగిరిలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నామని తెలిపారు. 2027లో మరోసారి ప్లీనరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్, మాజీ మంత్రి సుచరిత తదితరులు పరిశీలించారు.