అమరావతి : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎంపీ(YCP MP) విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) స్ట్రాంగ్గా సెటైర్లు (Satires) విసిరారు. ఈ మేరకు ఎక్స్ వేదిక ద్వారా మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతం మాత్రమే ఇచ్చాడాయే ! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించేవారట కదా అంటూ విమర్శించారు.
అచ్చంనాయుడూ!
దేముడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1% మాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించేవారట కదా! దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు… pic.twitter.com/G0UoqnGsQJ— Vijayasai Reddy V (@VSReddy_MP) September 26, 2024
దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని ఎద్దేవా చేశారు. నువ్వు మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి టీడీపీ (TDP) లో చేరేందుకు ప్రయత్నించాడని అచ్చెన్నాయుడు(Achennaiudu) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. అచ్చెన్నా, నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా . ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా, భ్రమల లోకంలో గెంతులేయాలనుకుంటే, గో.. ఆన్.. అంటూ సెటైర్లు వేశారు. జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా అంటూ వ్యాఖ్యలు చేశారు.