అమరావతి : సోషల్ మీడియాలో తనపై వచ్చిన అశ్లీల ప్రదర్శనపై ఏపీకి చెందిన హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేకే టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ అనే ముగ్గురు తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.
ఇప్పటికే జిల్లా ఎస్పీకి, సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసానని వెల్లడించారు. కొందరు తనను అప్రతిష్టపాలు చేసేందుకు సోషల్ మీడియాలో తన ఫొటోను మార్ఫింగ్ చేసి ఒక మహిళతో అసభ్యకరంగా వ్యవహరించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఏ విచారణకైనా ఫోరెన్సిక్ టెస్ట్కైనా సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. తనను టీడీపీ నాయకులు నేరుగా ఎదర్కొలేకే తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.