అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ ఎంపీ రఘురామరాజు బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజులుగా కొన్ని పత్రికలు చేస్తున్న దుష్ప్రచారంపై ఢిల్లీలో మీడియాతో నర్మగర్భంగా మాట్లాడారు. ఈ రోజు ఏపీ సీఎం వైస్ జగన్ ఢిల్లీ పర్యటనపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రధాని మోదీని కలువనున్నారని సమాచారం ఎలా ఉన్నా మోదీని కలిసిన తరువాత వైసీపీ నాయకుల ప్రచార ఆర్భాటంపై ఆయన ఆరోపణలు చేశారు.
ప్రధానితో 20 నిమిషాలు మాట్లాడితే 45 నిమిషాల పాటు మాట్లాడారని, సమస్యలన్నింటినీ సీఎం జగన్ మున్నెన్నడు లేనివిధంగా కులంకషంగా వివరించారని, ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆర్భాటం చేస్తారని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన రఘురామరాజును బీజేపీలో ఎలా చేర్చుకుంటారని, చేర్చుకుంటే తమకు నష్టం జరుగుతుందని, బీజేపీలోకి చేర్చుకోవద్దని జగన్ కోరుతారేమోనని వెల్లడించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం వచ్చే సమాచారం మేరకు తాను పార్టీ మారే అవకాశాన్ని పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
ఏపీలో విగ్రహాల ధ్వంసం విచారకరమని అన్నారు. దేవుళ్ల విగ్రహాలను, దేవుడు లాంటి ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు లేవు. పట్టపగలు విచక్షణ లేకుండా ప్రవర్తించడం దురదృష్టకమరని అన్నారు.