Pithapuram | ఇటీవల జనసేనను వీడి వైసీపీలో చేరిన పిఠాపురం నేత మాకినీడి శేషుకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మోయడానికే జనసేన పుట్టినట్లు ఉందని ఆమె ఆరోపించారు. ఇన్ఛార్జిలు ఏం చేస్తున్నారనే వివరాలను పవన్ కళ్యాణ్ ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో జనసేనలో చాలామంది నేతలు, కార్యకర్తలు ఉన్నారని వ్యాఖ్యానించింది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డ తనను జనసైనికులతో బూతులు తిట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు.