కడప జిల్లా బద్వేల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి వైసీపీ 23,754 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో వైసీపీకి 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్కు 580 ఓట్లు వచ్చాయి. అంతకుముందు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లోనూ వైసీపీ ఆధిక్యం కనబరిచింది.