అమరావతి : వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) టీడీపీ, జనసేన నాయకులపై మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అతడి కొడుకు నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. విజయనగరం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువగళం ముగింపులో చంద్రబాబు, పవన్కల్యాణ్ ప్రసంగాలపై విమర్శలు చేశారు. గురువారం ఆయన గుడివాడలో మీడియాతో మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్ పాలనపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు ఆ నేతలు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 2009లోనే వైఎస్ జగన్ యుద్ధం మొదలు పెట్టారని, 2014లో చంద్రబాబును, పవన్ను, లోకేష్ను ఓడించి జగన్ తన సత్తాను చాటిన విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు. సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాలకు వలసపోయి అక్కడి నుంచి పోటీ చేయనున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు.