అమరావతి : తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra babu) , జనసేన నేత పవన్కల్యాణ్ ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతరం అందరికీ ఆయూరారోగ్యాలు, సకల శుభాలు చేకూర్చాలని పేర్కొన్నారు. ఉగాధి తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగతికి, ప్రజా సంక్షేమానికి పాటుపడదామని అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా బాగుండాలని మనస్ఫూర్గి కోరుకుంటానని అన్నారు. క్రోధి నామ (Krodhinama) సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని, పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని అన్నారు. క్రోధి నామ సంవత్సరం ప్రజలకు, రైతులకు, మహిళలకు, ఉద్యోగులకు మరింత మేలు జరుగాలని ఆకాంక్షించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కూడా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రజల జీవితాల్లో ఉషస్సులు నింపాలని కోరారు.