అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna) జనసేన పార్టీలో చేరనున్నారు. ఇటివలే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో భేటి అయ్యారు. జనసేనలోకి రావాలసిందిగా కొణతాలను ఆహ్వానించగా తన అభిమానులు, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్కు చెప్పారు.
తాజాగా ఆయన ఆదివారం అనకాపల్లి (Anakapalli) లో తన అభిమానులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు జనసేనలో చేరాల్సిందిగా కొణతాలకు సూచించారు. అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడుతూ తాను జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. జనసేనాని అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో చేరతానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar reddy) మంత్రివర్గంలో కొణతాల మంత్రిగా పనిచేశారు.