ముంబై: టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ హత్య కేసులో ఇవాళ ముంబై హై కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రౌఫ్ మర్చెంట్ను దోషిగా బాంబే హైకోర్టు తేల్చింది. ముంబైలోని జూహూలో ఉన్న ఓ ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో గుల్షన్ కుమార్ను కాల్చి చంపారు. 1997, ఆగస్టు 12వ తేదీన ఆ మర్డర్ జరిగింది. ఆ కేసులో అబ్దుల్ రౌఫ్ మర్చంట్ అనే వ్యక్తి దోషిగా తేలాడు. రౌఫ్ మర్చెంట్కు గ్యాంగ్స్టర్ దావూద్తో లింకు ఉన్నది. ఇదే కేసులో నిర్దోషిగా తేలిన అబ్దుల్ రషీద్ను దోషిగా తేల్చుతూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. తాజా తీర్పులో కోర్టు అబ్దుల్ రషీద్కు జీవితకాల శిక్షను ఖరారు చేసింది.
కాంట్రాక్ట్ కిల్లర్ రౌఫ్ మర్చెంట్కు 2002లో జీవితఖైదు శిక్షను వేశారు. ఔరాంగాబాద్ జైలులో ఉన్న సమయంలో మర్చంట్ తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్కు పరారీ అయిన అతన్ని మళ్లీ పట్టుకున్నారు. ఈ కేసులో తాను నిర్దోషిని అంటూ మర్చంట్ కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. అయితే ఇవాళ జస్టిస్ జాదవ్, జస్టిస్ బోర్కార్లతో కూడిన ధర్మాసనం ఆ అప్పీల్పై తీర్పును వెలువరించింది.