అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని తెలిపారు. రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కేంద్రం కూడా చెప్పిందన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని వివరించారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయం అప్పటి విభజన చట్టంలో ఉందని, రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయంపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.