అమరావతి : ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ సీపీఐ నాయకుడు రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో బలం ఉంది కదాని ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం తగదని అన్నారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరిచ్చారని మండిపడ్డారు. పిచ్చోడి చేయిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని చరిత్రలో జగన్ రెడ్డి కాదు పిచ్చిరెడ్డిగా మిగిలిపోతారని అన్నారు.
కొత్తగా యూనివర్సిటీలు నిర్మించి వాటికి పేర్లు పెట్టుకోవాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు.పేరు మార్పును ఎవరూ అంగీకరించరని అన్నారు. జగన్ నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. మూడేళ్లలో యూనివర్సిటీ కట్టావా, మెడికల్ కళాశాలలను నిర్మించావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారని పైగా వర్సిటీలను దివాళా తీయించారని మండిపడ్డారు.