అమరావతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం టి.ఎం లోయ వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడిన ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి . మదనపల్లె నుంచి కలికిరికి వివాహ వేడుకకు వెళ్తుండగా మార్గమధ్యలో మలుపు వద్ద పెళ్లి బస్సు చెట్టును ఢీకొంది. దీంతో వ్యాన్లో ఉన్న మదనపల్లె, రామాచారులపల్లి వాసులు 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.