అమరావతి : టీడీపీ నాయకులు వైసీపీ కుటుంబ సభ్యులు, వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే అంతకు రెండింతలు ప్రతిస్పందిస్తామని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా కుటుంబాల జోలికి వెళ్లవద్దని, రాజకీయాలు రాజకీయాలుగానే చూడాలని సూచించారు. షర్మిల పార్టీకి మద్దతు తెలపడానికి విజయమ్మ వైసీపీ పార్టీ నుంచి వైదొలిగిందని అన్నారు. విజయమ్మ షర్మిల మద్దతు తెలుపడంలో తప్పేమిలేదని పేర్కొన్నారు.
అవసరానికి వాడుకుని వైసీపీ పార్టీ నుంచి వదిలివేయడం ఏపీ సీఎం జగన్కు అలవాటే నని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అన్నారు. నిన్న చెల్లి, ఇవాళ కన్న తల్లిని బయటకు గెంటేశారని పేర్కొన్నారు. బాబాయి ను ఎవరైనా చంపగలుగుతారా, తల్లి, చెల్లిని ఎవరైనా దూరం చేస్తారా అని ప్రశ్నించారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి స్పందించారు.