అమరావతి: దేశంలో గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఏపీలో 31 కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుతో కలిసి శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు .
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. కాలుష్య నివారణకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. పెట్రోల్, డీజిల్కు బదులుగా వాహనాల్లో సీఎన్జీ, ఎల్ఎన్జీ వాడాలని పిలుపునిచ్చారు. పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం చాలా ముఖ్యమని అన్నారు. ఏపీలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను నిర్మిస్తున్నామని తెలిపారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దేశంలో రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు అన్నదాతలే కాదు రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారతారని గడ్కరీ పేర్కొన్నారు.
అవినీతి లేని దేశంగా తయారు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రూ. 21 వేల కోట్లతో రహదారుల ప్రాజెక్టులు చేపట్టామని, కేంద్రం అండతో రాష్ట్రంలోని రోడ్ల రూపురేఖలు మారుస్తామని వివరించారు.