అమరావతి : ఏపీలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలవరంతో సహ ప్రాధాన్యత ఇతర ప్రాజెక్టులను మేరకు పూర్తి చేయాలని సూచించారు. పోలవరం దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంశాలపై తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసాన్ని పూర్తి చేయాలని అన్నారు.
దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు సంబంధించి డిజైన్లు వచ్చాయని, జూలై 31 వరకు పూర్తవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. తోటపల్లి బ్యారేజ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. సంగం బ్యారేజ్కు మేకపాటి గౌతంరెడ్డిగా సంగంగా నోటిఫై చేయాలని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ పనులు శ్రీకాకుళం వరకు పొడిగించాలని ఇందుకు అవసరమైన భూ సేకరణపై దృష్టిని సారించాలని ఆదేశించారు.