Kandula Durgesh | ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖ వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామని మావోయిస్టుల పేరిట ఓ లేఖ వచ్చింది. ఏకంగా ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ఉన్న మంత్రి పేషీకి ఈ లేఖ రావడం కలకలం సృష్టించింది.
మావోయిస్టుల బెదిరింపు లేఖపై మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు లేఖపై దర్యాప్తు చేపట్టారు. ఈ లేఖ ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఇది నిజంగానే మావోయిస్టులు పంపించారా? లేదంటే ఆకతాయిలా పనా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.